Saturday, April 27, 2024

బీజేపీ స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు…. బండి సంజయ్ వార్నింగ్

ఎన్ని కుట్రలు చేసినా కూడ రెండు ఎమ్మెల్సీలు కచ్చితంగా గెలుస్తామన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు పీఆర్సీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు బండి. పీఆర్సీపై కేసీఆర్ మాట తప్పడం ఖాయమన్నారు. మంత్రులతో ఉద్యోగులను తిట్టించిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్నారు. వారం రోజుల్లో ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైయిందని ప్రశ్నించారు.

ఓవైసీ కి తప్ప కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరని అన్నారు. మోడీ సహా కేంద్ర మంత్రులను కలుస్తున్న కేసీఆర్ ఎందుకు రావాల్సిన నిధులు అడగట్లేదన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తోంది కాబట్టే ఢిల్లీ వెళ్లి సైలెంట్ గా వస్తున్నారు. మరోవైపు నా పై ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. 600 కోట్లు నేను సంపాదించింది నిజమైతే నిరూపించండి. 600 కోట్లు నిరూపించి ఆ డబ్బులతో నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ బీజేపీ స్టార్ట్ చేయడం మొదలు పెడితే టీఆరెస్ వాళ్ళు తట్టుకోలేరని హెచ్చరించారు బండి సంజయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement