Sunday, April 28, 2024

TS : బండి రాజ‌కీయ డ్రామాల‌కు తెర‌లెపారు…. మంత్రి పొన్నం కౌంట‌ర్ అటాక్‌…

బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెపారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ అటాక్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను బండి సంజయ్ ని ప్రశ్నించాను దానికి జవాబు చెప్పలేక దాడి చేసినట్టు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎం చేశారని ప్రరశ్ని​నించారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాదు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్ర ని కొనసాగిస్తున్నాడన్నారని విమ‌ర్శించారు. అతని యాత్ర కి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలెపారని ఆరోపించారు. యాత్రలు అడ్డుకోవడం లేదని, ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉంద‌ని, మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని అంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement