Thursday, May 2, 2024

TS: మణుగూరు భారజల కర్మాగారానికి అవార్డు..

అశ్వాపురం, ఫిబ్రవరి 27 (ప్రభ న్యూస్) : అశ్వాపురం మండలంలో గల మణుగూరు భారజల కర్మాగారానికి 2022-2023 ఏడాదికి గాను స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది. హెవీ వాటర్ డే సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో భారత అనుశక్తి విభాగం కార్యదర్శి అనుశక్తి కమిషన్ చైర్మన్ అయిన అజిత్ కుమార్ మొహంతి చేతుల మీదుగా స్పెషల్ అవార్డును మణుగూరు భారజల కర్మాగార జీఎం జగ్గారావు, మణుగూరు ఏవి వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, అనుశక్తి కార్మిక సమాఖ్య జాతీయ అధ్యక్షులు గడ్డం రమేష్ అందుకున్నారు.

ఈ సందర్భంగా జిఎం జగ్గారావు మాట్లాడుతూ… అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం మూలంగానే మణుగూరు కర్మాగారానికి ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డును దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమన్వయంతో పనిచేస్తూ మణుగూరు భారతీయుల కర్మాగారాన్ని అగ్రస్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement