Sunday, April 28, 2024

Bandi Sanjay: బండికి కీల‌క బాధ్య‌త‌లు.. కిసాన్‌మోర్చా ఇన్‌ఛార్జీగా నియామ‌కం…

క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు బీజేపీ అధిష్టానం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. బండి సంజయ్‌ను కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. కీలక శాఖలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

ఇందులో బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ సహా పార్టీ సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి బండి సంజయ్ కుమార్, యువమోర్చా ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్ బైజ్యంత్ జె పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్ డాక్టర్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మోర్చా ఇంచార్జీగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్చార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement