Saturday, May 11, 2024

డిపాజిట్ ట్లు రాని కాంగ్రెస్ కు ఎవరు ఓట్లు వేస్తారు – బండి సంజయ్ పంచ్

హైదరాబాద్ – వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు మాత్రమే అనుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా అనుకోవాలని అన్నారు. డిపాజిట్లు ఏ పార్టీ కోల్పోతుందనే విషయం అందరికీ తెలుసంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. నోవాటెల్ లోని హోటల్ వద్ద ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ, డిపాజిట్ ట్లు రాని కాంగ్రెస్ కు ఎవరు ఓట్లు వేస్తారు అంటూ ఎద్దేవా చేశారు.

.రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని… ఈ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వివరించారు. బీజేపీ గెలిచిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ నేతలు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని విమర్శలు చేశారు. . రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గమనిస్తోందని బండి సంజయ్ వివరించారు.

కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లంతా ఎలాగూ బీఆర్ఎస్ లోకి వస్తారని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ను పైకి లేపుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు వేల కోట్ల పాకెట్ మనీ ఇచ్చి కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement