హైదరాబాద్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. నామినేషన్ ల గడువు లోగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో బండ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఎన్నికైన బండ ప్రకాశ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు.
విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు. మండలి డిప్యూటీ చైర్మెన్గా ఎన్నికైన బండ ప్రకాశ్ను మంత్రి కేటీఆర్తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.