Monday, April 29, 2024

Bakrid – ఆవులు, దూడలను కోస్తే ఊరుకోబోం – ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

హైద‌రాబాద్ – బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోబోమన్నారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ . సుప్రీం ఆదేశాల ప్రకారం వాటిని హింసించకూడదని ఆయన గుర్తు చేస్తూ, మేకలు, గొర్రెలు కోసుకొని బక్రీద్ చేసుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఈనెల 27న బక్రీద్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన త‌న లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదని,. కనీసం చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే ఆవులు, దూడలను రక్షించుకునేందుకు తామే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు. ‘మీరు చర్యలు తీసుకోకపోతే మా బృందాలు రంగంలోకి దిగుతాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement