Sunday, April 28, 2024

KTR : నికృష్ట రాజకీయం – ఎన్నికల్లో లాభం కోసమేనా

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా ట్విట్ట‌ర్ (ఎక్స్) వేదికగా కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనే విషయం తేలిపోయిందన్నారు.

- Advertisement -

మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమ్మతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల‌ని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని.. ఈ విష‌యంలో డిపార్ట్ మెంట్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కడతామని ఎల్అండ్‌టీ కంపెనీ కూడా ముందుకు వచ్చిందని తెలిపారు.

చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న కాంగ్రెస్‌

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్‌ను కావాల‌నే బద్నాం చేస్తోంద‌ని కేటీఆర్ అన్నారు. ఒకే ఒక అజెండాతో… కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement