Wednesday, May 8, 2024

ADB: అనారోగ్యంతో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ లక్కెరావు మృతి

ఉట్నూర్, ఆగస్టు1 (ప్రభన్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉర్దూ ఐటీడీఏ పాలకమండలి చైర్మన్ కనక లక్కీరావు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అకస్మాత్తుగా మృతిచెందడం పట్ల ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మంచి నాయకున్ని కోల్పోయామని ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు, వైసీపీ దావుల బాలాజీ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, నాయకులు అన్నారు. చైర్మన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడలో సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయని అధికార వర్గాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement