Sunday, April 28, 2024

Bhadradri: భద్రాచలంలో అట్టహాసంగా రథోత్సవం

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సంద‌ర్భంగా ఇవాళ‌ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామి వారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు. శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు.

వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement