Monday, May 6, 2024

UP CM YOGI: ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు…ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం…

సీఎం యోగి మరో ట్వీట్‌లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.

ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోందని, ఈ సందర్భంగా దిగ్విజయ్‌నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement