Tuesday, April 30, 2024

పేకాట శిబిరంపై దాడి – 12మంది రియ‌ల్ ఎస్టేట్ ట్రేడ‌ర్ ల‌ అరెస్ట్

పేకాట ఆడుతోన్న 12మంది రియల్ ఎస్టేట్ ట్రేడ‌ర్ ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ. 9ల‌క్ష‌ల స్వాధీనం చేసుకున్నారు. పేకాట శిబిరంపై దాడి చేసి మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు పాపిరెడ్డి (అల్వాల్), కార్తీక్ గౌడ్, సంతోష్ (ఎల్బీనగర్), సతీష్ (సంతోష్ నగర్), సీర్ల రెడ్డి (సిద్దిపేట), రామయ్య (మెదక్), వెంకట నర్సింహరాజు(అల్వాల్), సద్గురురెడ్డి (బీరంగూడ), కృష్ణ (బీరంగూడ), అప్పలరాజు (గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేట కు చెంది మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement