Friday, April 26, 2024

ప్రైవేట్​ ఆస్పత్రిలో దారుణం.. గర్భిణికి ట్రీట్​మెంట్​ విషయంలో నిర్లక్ష్యం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిసింహ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం కొటల్ పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ ప్రవళిక (నిత్యశ్రీ) డెలివరీ స్కానింగ్ కోసం రాగా కడుపులో బిడ్డ చనిపోయిందని వైద్యురాలు తెలిపింది. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బ్రతికి ఉండేదని కుటుంబ సభ్యులు అన్నారు. బిడ్డ చనిపోయిందని చెప్పి గర్భిణీని పట్టించుకోకుండా తినడానికి వైద్యురాలు ఇంటికి వెళ్లారని ఆరోపించింది. చనిపోయిన బిడ్డతో తల్లికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యురాలితో గ‌ర్భిణీ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement