Sunday, May 5, 2024

తెలంగాణలో పలువురు డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీల బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పి టి సి లో పనిచేస్తున్న శ్రీనివాసులు ను కామారెడ్డి డిఎస్పీగా, కామారెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్న శశాంక్ రెడ్డిని హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ కు బదిలీ చేశారు. రామగుండం సీసీ అర్ బి పనిచేస్తున్న నాగేంద్ర చారి ని వేములవాడ డిఎస్పీగా, వేములవాడ డిఎస్పీగా పనిచేస్తున్న చంద్రకాంత్ ను చీఫ్ ఆఫీస్ కు, 100 డయల్ లో పనిచేస్తున్న ఉమెందర్ ను ఆదిలాబాద్ డీఎస్పీగా, ఆదిలాబాద్ డిఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావును చీఫ్ ఆఫీస్ కు, వేయిటింగ్ లో ఉన్న కృష్ణ కిషోర్ ను అచ్చంపేట డీఎస్పీగా, రాచకొండ పిడి సెల్ లో పనిచేస్తున్న మోహన్ కుమార్ ను నాగర్ కర్నూల్ కు, నాగర్ కర్నూల్ లో మోహన్ రెడ్డిని చీఫ్ ఆఫీస్ కు, ఏసీబీ లో పనిచేస్తున్న మధుసూదన్ వరంగల్ ట్రాఫిక్ కు, వరంగల్ ట్రాఫిక్ లో పనిచేస్తున్న బాల స్వామిని చీఫ్ ఆఫీస్ కు, నిర్మల్ డి సి ఆర్ బి లో పనిచేస్తున్న జీవన్ రెడ్డిని నిర్మల్ డీఎస్పీగా, నిర్మల్ డీఎస్పీగా పనిచేస్తున్న ఉపేందర్రెడ్డి ని చీఫ్ ఆఫీస్ కు, సిఐడి లో పనిచేస్తున్న అంజయ్యను ఎల్బీనగర్ ఏసిపి గా, ఎల్బీ నగర్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి ని చీఫ్ ఆఫీస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement