Tuesday, May 14, 2024

Asifabad – ముఖ్యమంత్రి సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ దండి విఠల్

కాగజ్ నగర్ టౌన్జూన్ 28 (ప్రభన్యూస్)కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 30వ తేదీన జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను వర్షంలో సైతం దగ్గరుండి ఎమ్మెల్సీ దండేవిటల్ పర్యవేక్షించారు. గత రెండు రోజులుగా ఏర్పాట్లను ఏ లోటు పాటలు లేకుండా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బురదలో సభాస్థలి ప్రాంగణం మొత్తం తిరుగుతూ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

ఆయన వెంట కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement