Friday, May 10, 2024

నెలాఖరు నుంచి ఆషాఢ బోనాలు షురూ.. ఏర్పాట్లపై 6న మంత్రి తలసాని సమీక్ష

జూన్ నెలాఖరు నుంచి ఆషాఢ బోనాలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి (6వ తేదీన) వేడుకలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష జరుగనుంది. దీనికి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్‌ సభ్యులు హాజ‌రుకానున్నారు.

కాగా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. అలాగే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేడుకల నిర్వహణ, ఏర్పాట్లతో పాటు భద్రత సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement