Monday, April 29, 2024

మ‌ణిపూర్ త‌గుల‌బ‌డుతుంటే రోడ్ షోలా – మోడీపై విరుచుకుప‌డ్డ ఒవైసీ

హైద‌రాబాద్ – మణిపూర్ తగలబడుతుంటే,జమ్మూకశ్మీర్ లో సైనికులు చనిపోతుంటే, కర్ణాటకలో ప్రధాని మోడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ .. ప్ర‌ధాని మోడీ తీరును ఆయ‌న తీవ్రంగా గ‌ర్హించారు..మ‌ణిపూర్ కాష్టంగా మారుతుంటే , మరో వైపు పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను చంపుతున్నార‌ని, ఇప్ప‌టికే ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్నార‌ని అన్నారు.. మణిపూర్‌లో హింస చెలరేగుతోంద‌ని, అక్క‌డ గ్రామాల‌కు గ్రామాలే త‌గుల‌బ‌డిపోతున్నాయ‌ని, పేర్కొన్నారు అస‌దుద్దీన్…మ‌ణిపూర్ లోని ప్రజలు తమ ఇళ్లు వదిలి పారిపోతుంటే మోడీ మాత్రం కేరళ స్టోరీ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం విచారకరం అని ఒవైసీ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని నరేంద్ర మోడీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement