Saturday, April 27, 2024

TS : బీజేపీలో చేరిన‌ ఆరూరి ర‌మేష్

ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్‌ బీజేపీ గూటికి చేరారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఆరూరి ర‌మేష్‌ను కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అయితే తొలుత ఆరూరి పార్టీ మారుతారనే ప్రచారం జరగగా గులాబీ బాస్ కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ బుజ్జగింపులు ఫలించలేదు.ఈ క్రమంలోనే ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement