Sunday, April 28, 2024

పక్కా స్కెచ్​: వార్డు కౌన్సిలర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్.. కారు, గొడ్డలి, కత్తి స్వాధీనం

మహబుబాబాద్​: వార్డు కౌన్సిలర్​ బానోతు రవి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యను పక్కా పథకం ప్రకారమే చేశారని, రవిపై కక్షతో అతడిని ట్రాక్టర్​తో గుద్ది, గొడ్డలి, కత్తితో నరికి చంపినట్టు తమ విచారణలో తెలిసిందని పోలీసులు ఇవ్వాల వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి ఎస్పీ శరత్​ చంద్ర పవార్​ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘భుక్య విజయ్, భుక్య అరుణ్ సన్నిహితంగా ఉంటూ బానోతు రవి చేసే బిజినెస్ లలో సహకరించేవారు. అలా ప్రతి విషయంలో రవి వారిని వాడుకున్నడే తప్ప డబ్బులు ఇవ్వటం లేదనివారు కూడా సొంత వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు. అప్పటినుండి వారి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. మాట్లాడుకోవటం మానేసారు. ఈ క్రమంలో వారికి చాలా విషయాల్లో రవి అడ్డుతగులుతున్నాడని భావించి హతమార్చేందుకు ప్లాన్​ వేశారు..

రవి ఒంటరిగా ఊరు వెళ్తున్న విషయాన్ని గమనించి ట్రాక్టర్​తో గుద్ది, కారులో తెచ్చుకున్న గొడ్డలి, కత్తితో నరికి చంపారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన భూక్య విజయ్, భూక్య అరుణ్ లను అదుపులోకి తీసుకొని వారి నుండి నేరానికి ఉపయోగించిన SHIFT DEZIRE కారు, అరుణ్ ఉపయోగించిన కత్తి, వారి ఫోన్లు, రక్తపు మరకలు గల వారి బట్టలు స్వాధీనం చేసుకున్నారు. వారి వాంగ్ములం ప్రకారం ఇతర నిందితులు అజ్మీర బాలరాజు, గుగులోతు చింటు , గుగులోతు భావుసింగ్, అజ్మీర కుమార్, కారపాటి సుమంత్ అదుపులోకి తీసుకున్నట్టు ఎస్​పీ శరత్​ చంద్ర పవార్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement