Thursday, May 2, 2024

Breaking: 3 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్​ చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్​ చైర్మన్ గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నియమితులైన రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మెట్టు శ్రీనివాస్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ముఖ్యమంత్రి కేసీఆర్​కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రావుల శ్రీధర్​ రెడ్డి..
ముఖ్యమంత్రి కేసీఆర్​కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మెట్టు శ్రీనివాస్​
Advertisement

తాజా వార్తలు

Advertisement