Friday, April 19, 2024

ఈజీ మ‌నీ కోసం చోరీల బాట‌.. న‌లుగురు యువ‌కులు అరెస్టు

గుంటూరు క్రైo, ప్ర‌భ‌న్యూస్ : గుంటూరు జిల్లా సౌత్ సబ్ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితుల‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేర‌కు డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. మేడి కొండూరు, వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ నలుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశామని, ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితుల్లాగా వీరు ఆటోలో తిరుగుతూ మ‌హిళ‌ల‌ను బెదిరించి చోరీలు చేస్తున్నారు.

ఒంటరిగా ప్రయాణించే ఆడాళ్లే వీరి టార్గెట్​ అని.. అట్లాంటి వారిని గుర్తించి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిని బెదిరించి సెల్ ఫోన్లు, డబ్బులు కాజేస్తుంటారని డీఎస్పీ తెలిపారు. చేడు వ్యసనాలకు బానిసైన యువకులు ఈజీగా మని సంపాదించి వారి అవసరాలు తీర్చుకునేందుకు చోరీల‌కు అల‌వాటు ప‌డ్డార‌ని తెలిపారు. కాగా, వీరిని మెడికొండూరు, వట్టిచెరుకూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సౌత్ డిఎస్పీ జెస్సి ప్రశాంతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement