Friday, May 3, 2024

BRS: 11స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం పోటీ.. పెండింగ్ లో జనగాం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం మినహా మిగిలిన 11నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు నుంచి నన్నపునేని నరేందర్, వర్దన్నపేట నుంచి ఆరూరి రమేష్ ను ప్రకటించారు.

అలాగే పరకాల నుంచి చల్ల ధర్మారెడ్డి, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బానోత్ శంకర్ నాయక్, డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యా నాయక్, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు నుంచి బడే నాగజ్యోతి అభ్యర్థులుగా ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. జనగామ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement