Wednesday, May 15, 2024

జోడెడ్లలా కలసి పని చేస్తాం … ..భువనగిరి ఎంపీగా పోటీ చేస్తాః .కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – సీఎం కేసీఆర్ సారధ్యంలో భువనగిరి అభివృద్దే ధ్యేయంగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తో జోడెడ్లలా కలసి పని చేస్తానని భారాస నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలోనే భువనగిరి పార్లమెంటు పరిధిలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే గా శేఖర్ రెడ్డి కొనసాగుతార‌ని, త‌న‌ను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేయాలని చెప్పినట్లు తెలిపారు.

ప్రజల మన్ననలను గెలుచుకుని ముందుకు సాగుతామని చెప్పారు. కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని, విజన్ ఉన్న గొప్ప నాయకుడు సీఎం అన్నారు. ఇద్దరం కలిసి అభివృద్ధి పథంలో భువనగిరి ని నడిపిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement