Thursday, May 9, 2024

Andholలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్య‌ర్ధి దామోదర్ రాజనర్సింహ

జోగిపేట, నవంబర్9(ప్రభన్యూస్): అందోల్ అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్ల జోరు కొనసాగింది. మాజీ డిప్యూటీ సీఎం అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కు ముందు ప్రచార వాహనంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ పద్మనాభరెడ్డి కాంగ్రెస్ నాయకురాలు త్రిష దామోదర్ ఇందిరా, ఆయన సతీమణి పద్మ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement