Saturday, May 18, 2024

అనంత పద్మనాభ స్వామి సేవలో కిషన్ రెడ్డి

వికారాబాద్ టౌన్ జనవరి 15 (ప్రభ న్యూస్ ):శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి ని ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం , ఈఓ టీ.నరేందర్. దర్శన అనంతరం వేద ఆశీర్వచనాలు చేసారు. ఆలయ అర్చకులు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కి స్వామి వారి ఫోటో బహూకరించారు. .

ఈ సందర్భంగా ఆలయ ఈవో నరేందర్ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చెయ్యాలని కేంద్ర మంత్రి కోరారు.అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని , దేవాలయం దగ్గర గల భూమి సమస్య గురుంచి వినతి పత్రం అందజేశారు

పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్రమంత్రి సుముఖంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమం మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం మరియు జిల్లా బి జె పి నాయకులు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు..

పి ఎం జన్ మన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిషన్

- Advertisement -

పెద్దేముల్ మండలంలోని చైతన్య నగర్ గ్రామంలో సోమవారం పి ఎం జన్ మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచులు, ఆదివాసులకు కావలసిన 11 రకాల కనీస సౌకర్యాలు కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే లు మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement