Sunday, April 28, 2024

Kamareddy: వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ముస్తాబాద్ రామవ్వ (75) అనే వృద్ధురాలిపై ఇంటి వద్దనే కుక్కలు దాడి చేశాయి. ఆమె ముఖం, చేతులపై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి.

ఇది గమనించిన గ్రామస్తులు వీధి కుక్కలను వెంటపడి తరిమివేశారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావంలో ఉన్న రామవ్వను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అక్కడి వైద్యులు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement