Monday, April 29, 2024

అబ్బురపడేలా దర్గా అభివృద్ధి – హోంమంత్రి మహమూద్ అలీ

కొత్తూరు, అక్టోబర్ 9 (ప్రభ న్యూస్): ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ జహంగీర్ దర్గాను అబ్బురపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ గ్రామంలో గల సయ్యద్ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులను సోమవారం వక్ఫ్‌ బోర్డ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై శంకుస్థాపన చేశారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, జ‌డ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, సర్పంచ్ అజయ్ నాయక్, నాయకులు సయ్యద్ రషీద్, పెంటనోళ్ళ యాదగిరి, నారాయణరెడ్డి, మిట్టు నాయక్, దేవేందర్ యాదవ్, ఇంద్రసేనారెడ్డి, రవీందర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement