Thursday, May 2, 2024

ADB: ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీని కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు…

ఉట్నూర్, ఫిబ్రవరి 2 (ప్రభ న్యూస్): గిరిజన సంక్షేమ వసతి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్లు తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శ‌రత్‌ను క‌లిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీకి శుక్రవారం ఆదిలాబాద్​కు వచ్చారు.

ఈ మేరకు ఆయ‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లి విన‌తిప‌త్రం అంద‌జేశారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న హామినిచ్చిన‌ట్లు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ అధ్యక్షులు షౌకత్ హుస్సేన్ తెలిపారు. అనంత‌రం శ‌ర‌త్‌ను వారు స‌న్మానించారు. ఆయ‌న‌ను క‌లిసిన వారిలో స‌భ్యులు జిల్లా కబీసీ నారాయణాయ, కనక విట్టల్ హిరమ్మ, కమల, తెలంగ్ రావు రాము, లక్ష్మి, శోభ,అశోక్ త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement