Friday, May 17, 2024

తుంటి మార్పిడిలో ఏయిమ్స్ ఘనత..

మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని ఏయిమ్స్‌ ఆసుపత్రిలో తుంటి మార్పిడిని విజయవంతంగా నిర్వహించారని ఆసుపత్రి వైద్యులు ఎగ్గెన శ్రీనివాస్‌ తెలిపారు. సత్తుపల్లి గ్రామానికి చెందిన మేడి రమేష్‌ అనే టీబీ పేషెంట్‌ తుంటి నొప్పితో బాధపడుతూ నడవలేని పరిస్థితిలో ఉండటంతో ఏయిమ్స్‌ ఆసుపత్రి వైద్యుడు ఎగ్గెన శ్రీనివాస్‌ను కలిసి విషయాన్ని వెల్లడించగా ఆయన అత్యాధునిక పద్దతిలో తుంటి మార్పిడి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ చేసిన మరుసటి రోజు నుండే నడిపించామని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఏయిమ్స్‌ ఆసుపత్రిలో 200లకు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లను చేయడం జరిగిందని, 85 సంవత్సరాల పై బడిన వారికి కూడా విజయవంతంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ల కోసం అంతకముందు లాగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన మంచిర్యాలలోని ఏయిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్లను చేయడం జరుగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement