Monday, April 29, 2024

TS: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి… ఇద్దరికి తీవ్రగాయాలు

బెజ్జూర్, ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్) : కోమురంబీం అసిపాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెజ్జూరు మండలంలోని పోతపెల్లి – కొరత గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో అర్కగూడా గ్రామానికి చెందిన ఆత్రం మహేష్, (25)తోర్రెం వెంగల్ రావు(30) ఎలుక పల్లి గ్రామానికి చెందిన దున్న నరసింహులు (20) అక్కడికక్కడే మృతి చెందారు.

ఎలకపల్లి నుండి పోతేపల్లికి పెండ్లి శుభకార్యంకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలియజేశారు. రోడ్డు ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కౌటాల సిఐ సాదిక్ పాషా, బెజ్జూర్ ఎస్ఐ విక్రమ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని, గాయపడిన నిఖిల్, రాజకుమార్ లను 108 అంబులెన్స్ లో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement