Sunday, April 28, 2024

బైంసాలో విషాదం.. భార్య ఆత్మహత్య.. భ‌ర్త‌ ఆత్మహత్యాయత్నం..

నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం ఓ కుటుంబంలో కలహాలు తీరని విషాదాన్ని నింపాయి. పట్టణంలోని నర్సింహా నగర్ కు చెందిన ఈరేవార్ దీపా (22) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకోగా.. భర్త సాయి ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని ఆత్మహత్య యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయికి గత ఏడాది దీపాతో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా ఇంట్లో గొడవలు జరుగగా.. క్షణికావేశానికి లోనైన దీపా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందని మనస్థాపం చెందిన సాయి కుభీర్ క్రాస్ రోడ్డులో గల ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. దీపా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement