Sunday, April 28, 2024

ADB: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. నిరాశతో వెనుదిరిగిన నీలకంఠేశ్వర్

మంచిర్యాల, నవంబర్ 10 (ప్రభ న్యూస్): మంచిర్యాల నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగింది. నామినేషన్ల స్వీకరణ కోసం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉండగా.. చివరి నిమిషంలో భీమిని మండలానికి చెందిన రాంటెంకి దశరథం నామినేషన్ కేంద్రానికి చేరుకొని తన నామినేషన్ ను సమర్పించారు.

మంచిర్యాలకు చెందిన డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ తన నామినేషన్ ను సమర్పించేందుకు తన మద్దతుదారులతో నామినేషన్ కేంద్రానికి రాగా అప్పటికే సమయం ముగియడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. నీలకంఠేశ్వర్ గౌడ్ గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం బీసీ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా మరో అభ్యర్థి సైతం 10 నిమిషాల ఆలస్యంగా రావడంతో ఆయనను కూడా పోలీసులు అనుమతించక పోయేసరికి ఆయన కూడా నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement