Thursday, May 2, 2024

ADB : సామూహిక ప్రార్థనల్లో ఎస్పీ గౌస్ అలం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్: పవిత్ర రంజాన్ పండుగను గురువారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం రంజాన్ మాసం ఉపవాస దీక్షలు విరమించిన ముస్లిం సోదరులు గురువారం ఆనందోత్సవాల మధ్య పండగ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

- Advertisement -

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడింది. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అందరితో కలిసి సామూహిక ప్రార్ధనలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి లక్కాడి జీవన్ రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, పోలీస్ అధికారులు, ముస్లిం సోదరులు ఎస్పీ గౌస్ అలo ను కలిసి ఆలింగనం చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, లౌకిక వాదానికి ప్రతికగా నిలిచే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మత పెద్దలు పండగ విశిష్టతను, శాంతి సౌబ్రాతత్వం గురించి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement