Tuesday, April 30, 2024

సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచ్ కారీ..

మంచిర్యాల : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి 15వ వార్డు భగత్‌నగర్‌లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ఆదేశానుసారం ఆ వార్డు కౌన్సిలర్‌ శ్రీరాముల సుజాత-మల్లేష్‌ వార్డులోని కూడళ్లలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ కరోనాను నియంత్రించేందుకు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయిస్తున్న కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావులకు వార్డు ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల రాజు, గాండ్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement