Monday, May 6, 2024

Adilabad | ఆర్టీసీ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

శ్రీరాంపూర్ (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లాలో బ‌స్సు బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (బుధ‌వారం) ఉద‌యం జ‌రిగింది. శ్రీరాంపూర్ ఏరియాలోని జిఎం ఆర్టీసీ బస్సు టిఎస్ 19జెడ్ 0045 బోల్తా పడింది. శ్రీరాంపూర్ సింగరేణి జి ఎం ఆఫీసు నేషనల్ హైవే రింగ్ రోడ్డు సమీపంలో బోల్తా పడి ఘోర ప్రమాదం తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

హైదరాబాదు నుండి మంచిర్యాల్ కు వస్తుండగా ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అరుణ్ అక్క నగర్ వద్ద రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో ఎటువంటి ప్రమాద హెచ్చరిక గుర్తులు పెట్ట‌లేదు. దీంతో ఆ పక్కన ఉన్న గొయ్యిలోకి బ‌స్సు దూసుకెళ్లి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. ఆ త‌ర్వాత‌ బోల్తా పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement