Tuesday, May 7, 2024

Exclusive | ఆ బాలిక రెస్పాన్స్​ నాదే.. ఆంధ్రప్రభ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందన​!

సరస్వతి పుత్రిక.. కరుణించని లక్షీ కటాక్షం పేరుతో ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్​ స్పందించారు. నర్సింగ్​ చదవాల్సిన బాలిక తండ్రి మృతితో కుటుంబ భారం నెత్తినేసుకుని ఆటో నడుపుతున్న తీరును ఆంధ్రప్రభ మనుసులను కదిలించేలా రాయడంతో మంత్రి రెస్పాండ్​ అయ్యారు.

ర్యాంకు వచ్చినా కౌన్సెలింగ్​ ఫీజు కట్టలేక చదువు మానేసిన బాలికకు తాను అండగా ఉంటానని ఇవ్వాల (బుధవారం) వెల్లడించారు. ఈమేరకు ట్విట్టర్​ వేదికగా ఆయన ఆంధ్రప్రభ కథనాన్ని కోట్​ చేస్తూ రిప్లయ్ ఇచ్చారు. బాలిక చదువుకు తాను బాధ్యత తీసుకుంటానని, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు తన కార్యాలయం అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీంతో బాలిక కుటుంబంతో పాటు చాలామంది ఆంధ్రప్రభ కథనంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా రాశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement