Friday, April 26, 2024

పీఆర్‌టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక..

బెల్లంపల్లి : పట్టణంలో తెలంగాణ పీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తిరుమల్‌ రెడ్డి ఇన్నారెడ్డి పాల్గొన్నారు. టీఎస్‌ పీఆర్‌టీయూ బెల్లంపల్లి మండల అధ్యక్షునిగా అందె రామస్వామి, ప్రధాన కార్యదర్శి అడిచెర్ల శ్రీనివాస్‌, అసోసియేట్‌ అధ్యక్షులు ఎస్‌.కె.జావిద్‌ బాబా, మహిళా అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్‌, మహిళా కార్యదర్శి అరుణ జ్యోతిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌, సర్వీస్‌ పెంపు, కేజీబీవీ ఉపాధ్యాయులకు 180 రోజుల సెలవు, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ సాధించిన ఘనత పీఆర్‌టీయూకే దక్కిందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషి చేస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement