Thursday, April 25, 2024

వైరల్ వీడియో: పెట్రోల్ ధరలు భరించలేక ఇలా చేస్తున్నారు

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. ఏపీలో సెంచరీవైపు పరుగులు పెడుతోంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38 గా ఉంది. అటు తెలంగాణలోనూ పెట్రోల్ ధరలు సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.94 గా ఉంది.

అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలను సామాన్యులు భరించలేకపోతున్నారు. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. బైక్ వెనుక వైపు టైర్ బండిని జాయింట్ చేశారు. ఆ టైర్ బండిలో సుమారు 8 మంది ప్రయాణించే సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందిందో స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఇలా చేస్తే పెట్రోల్ ధరలను తట్టుకోవచ్చు అని ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement