Monday, April 29, 2024

ప్రైవేటు టీచర్స్ కి బియ్యం పంపిణి..

బెల్లంపల్లి : రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలకు కరిగి ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ.2వేల నగదుతో పాటు 25 కేజీల సన్న బియ్యాన్ని పంపిణీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆపన్న హస్తం అందిస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణంలలోని గొంతెమ్మగుట్ట చెరువు వద్ద గల రేషన్‌ షాపులో ప్రైవేటు పాఠశాల సిబ్బందికి ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై బియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ఉపాది లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాల సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి నెలకు రూ.2వేల నగదు, 25 కేజీల సన్నబియ్యంను పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, నెల్లి శ్రీలత, దామెర శ్రీనివాస్‌, బొడ్డు నారాయణ, నాయకులు మంగమూర్తి, శ్రీధర్‌, భీమాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement