Tuesday, May 21, 2024

బకాయి పన్నుల వసూళ్ళు

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో గత వారం రోజులుగా మున్సిపల్‌ కార్యాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్నులపై 90 శాతం వడ్డీ రాయితీ గురించి ప్రజలకు అవగాహన కల్పించి రూ.1.10లక్షల ఇంటి, నీటి కులాయి పన్ను బకాయిలను వసూలు చేయించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ, వాణిజ్య పన్నుల, నీటి కులాయిల పాత పన్ను, ఇతర బకాయిలు చెల్లించే వారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 90 శాతం వడ్డీ రాయితీని ఉపయోగించుకొని ఈ నెల 31వ తేది లోగా చెల్లింపులు చేయాలని అన్నారు. పన్ను బకాయిల చెల్లింపులకు ఆయా వార్డుల కౌన్సిలర్లు కృషి చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement