Thursday, May 2, 2024

ADB: వైద్య సిబ్బందిని పెంచాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుదవారం కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు.

మూడు మండలాల ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రిలో సేవలకు సరిపడ సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని పెంచాలని కోరారు. అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement