Thursday, May 2, 2024

సర్పంచుల ఆర్థిక ఇబ్బందులపై అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే..

బెల్లంపల్లి : సర్పంచుల ఆర్థిక ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గళం విప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామపంచాయితీలోని సర్పంచు ఆయా గ్రామపంచాయితీలోని వైకుంఠదామం, డంపింగ్‌ యార్డులను పూర్తి చేశారని, కానీ వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించి బిల్లులను త్వరగా విడుదల చేయాలని అన్నారు. అలాగే వైకుంఠదామాలు గ్రామానికి దూరంగా ఉన్నందున వాటి వరకు రహదారి, వైకుంఠ దామాలల్లో నీటి వసతికై నిధులను మంజూరు చేయాలని, అదేవిధంగా వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాల నిధుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన, నిరాదారమైన ఆరోపణలు చేస్తున్నందున వాటి నిర్మాణాల్లో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నిధుల వివరాలను స్పష్టంగా వివరించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement