Monday, April 29, 2024

ADB: ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు

హాజీపూర్, ఆగస్ట్ 11 (ప్రభ న్యూస్): మండలంలోని దొనబండ గ్రామంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేతుల మీదుగా శుక్రవారం ఇండ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దొనబండ గ్రామంలో 50మంది దళితులకు ఇండ్ల స్థల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దొనబండ ఎస్సీ కాలనీకి వరద వచ్చి నీళ్లు ఇంటిలోకి వస్తున్నాయని దళితులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ కాలనీకి చెందిన 50మందికి పట్టాలు మంజూరు చేయించుకుని వచ్చి నేడు వారికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు. ప్రభుత్వం అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని, మధ్యలో దళారులకు తావు లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం, అని రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, నాయబ్ తహసిల్దార్ హరిత, గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement