Friday, April 26, 2024

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయండి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములమై విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం నిర్వహించనున్నట్లు ఆయ‌న‌ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి అరణ్య భవన్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని మొక్క‌లు నాటాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement