Sunday, April 28, 2024

ADB: భూవివాదం.. పొలానికి వెళ్తుండగా దారుణ‌ హత్య

భూవివాదం కార‌ణంగా పొలానికి వెళ్తున్న వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తిర్యాని మండలం మాణిక్యపూర్ లో దారుణం జ‌రిగింది. పొలానికి వెళ్లిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

మృతుడిని ఆత్రం తిరుపతిగా గుర్తించారు. భూవివాదమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అనంతరం డాగ్ స్వ్కాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement