Thursday, May 9, 2024

కొత్తూర్‌ కుటుంబానికి ఆర్థికసాయం..

కాసిపేట : మండలంలోని లంబాడితండా(డి) గ్రామ పంచాయతీ పరిదిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన కొత్తూర్‌ అనే గిరిజనుడు చాలా రోజులు అనారోగ్యంతో భాదపడుతూ, మెరుగైనా వైద్యం చేయించుకోలేక మృతి చెందాడు. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆదివాసి నాయక పోడ్‌ మండల కమిటి నాయకులు, మృతుడి కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అంతకు ముందు కొత్తూర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడ్‌ సంఘం నాయకులు కొమ్ముల బాపు, మెండ్రపు రాజన్న,శ్రీకాంత్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement