Saturday, May 18, 2024

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తగిలిన కరోనా సెగ

తెలంగాణలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఈ మహమ్మారి సెగ తగిలింది. గతంలో 50 మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా.. గడిచిన మూడు రోజులలో మొత్తం 9 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఐదుగురు ఒకేసారి ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా ఓ ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్,ఇద్దరు కానిస్టేబుల్ కు ఈ మహమ్మారి సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement