Friday, May 3, 2024

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..

బెల్లంపల్లి : టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు సన్ని బాబు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సన్ని బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయం వల్ల 95 శాతం వరకు తెలంగాణ రాష్ట్రంలోని యువకులకే ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలుడిన శుభసందర్భంగా, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు పాలాభిషేకం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వి, టీఆర్‌ఎస్‌వై యువ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement