Thursday, April 25, 2024

విద్యార్థికి కాంస్య పతకం..

బెల్లంపల్లి : జాతీయ స్థాయి పెంకాక్‌ శిలాట్‌ (మార్షల్‌ ఆర్ట్స్‌) పోటీలను మార్చి 27వ తేది నుండి 31వ తేది వరకు నిర్వహించగా మందమర్రి మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న వంశీకృష్ణ 33-36 కేజీల విభాగంలో తాండింగ్‌ (ఫైటింగ్‌)లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం సాధించిన వంశీకృష్ణను బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భవిష్యత్తులో మన జిల్లా నుండి ఏసియన్‌ గేమ్స్‌లో ఆడాలని మరింత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జయకృష్ణారెడ్డి, రంగు శ్రీనివాస్‌, సీనియర్‌ కుంగ్‌ఫూ మాస్టర్‌ కాట్రేవుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement