Friday, May 17, 2024

జాతీయ విద్యా విధానం పుస్తకావిష్కరణ..

బెల్లంపల్లి : పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో జాతీయ విద్యా విధానం 2020 పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి వైస్‌ చైర్మన్‌, పాఠశాల అధ్యక్షుడు తొంగల సత్యనారాయణ, పాఠశాల సమితీ కార్యదర్శి శ్రీనివాస్‌, పూర్వ విద్యార్థి పరిషత్‌ ఉపాధ్యక్షుడు చింతం రమేష్‌, పూర్వ విద్యార్థి పరిషత్‌ కార్యదర్శి సజ్జనపు సంతోష్‌, కమల్‌ కిషోర్‌ లాహోటి, ముర్కూరి బాలాజీ, సూరం లక్ష్మీనారాయణ, నగర కార్యవాహ శేషుకుమార్‌, ఆచార్య బృందం ప్రధానోపాధ్యాయులు పూదరి సత్యనారాయణలు పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ విధానం ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement